డోక్లాంపై ఆగని చైనా దూకుడు

ABN , First Publish Date - 2020-11-23T07:25:50+05:30 IST

సిక్కిం సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ సమీపం దాకా చొచ్చుకొచ్చే ప్రయత్నాలను చైనా కొనసాగిస్తోంది. భూటాన్‌లో 2 కిలోమీటర్లు ఆక్రమించి ఓ గ్రామాన్నే నిర్మించిన చైనా ఇప్పుడు అక్కడి నుంచి 9 కిలోమీటర్ల మేర...

డోక్లాంపై ఆగని చైనా దూకుడు

న్యూఢిల్లీ, నవంబరు 22: సిక్కిం సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ సమీపం దాకా చొచ్చుకొచ్చే ప్రయత్నాలను చైనా కొనసాగిస్తోంది. భూటాన్‌లో 2 కిలోమీటర్లు ఆక్రమించి ఓ గ్రామాన్నే నిర్మించిన చైనా ఇప్పుడు అక్కడి నుంచి 9 కిలోమీటర్ల మేర ఓ పెద్ద రోడ్డు వేసింది. ఈ రోడ్డు 2017లో రెండు దేశాల మధ్య ఘర్షణ కేంద్రమైన జాంఫెరీ కొండప్రాంతానికి ప్రత్యామ్నాయ మార్గం. డోక్లాం పీఠభూమిపై ఉన్న ఈ మిట్ట వద్దే డ్రాగన్‌ను భారత సైన్యం నాడు నిలువరించింది. అక్కడే ఉన్న డో కలా వద్ద భారత ఆర్మీ పోస్ట్‌ ఉంది. 

Updated Date - 2020-11-23T07:25:50+05:30 IST