చింతపల్లి ఏఎస్పీ తప్పుడు ప్రచారం తగదు
ABN , First Publish Date - 2020-06-01T09:16:40+05:30 IST
ఏవోబీలో యాక్షన్ టీమ్లు తిరుగుతున్నాయని, రెక్కీ చేస్తున్నారని చింతపల్లి ఏఎస్పీ సతీశ్కుమార్ చేసిన ప్రకటనను
మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కమిటీ ప్రకటన
పాడేరు: ఏవోబీలో యాక్షన్ టీమ్లు తిరుగుతున్నాయని, రెక్కీ చేస్తున్నారని చింతపల్లి ఏఎస్పీ సతీశ్కుమార్ చేసిన ప్రకటనను మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కమిటీ కమిటీ కార్యదర్శి అరుణ ఒక ప్రకటనలో ఖండించారు. కరోనా నేపథ్యంలో మావోయిస్టులు పోలీసులపై ఎటువంటి దాడులకు పాల్పడబోమని స్పష్టంగా ప్రకటించామని, దానిపై ప్రభుత్వ వైఖరిని ప్రకటించాలని కోరినా పట్టించుకోలేదన్నారు. కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు మావోయిస్టు పార్టీ అవగాహన కల్పించడంతోపాటు వైద్య సేవలు అందిస్తుందన్నారు. కాని పోలీసులు వాస్తవాలు మరిచి, తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని పేర్కొన్నారు. ఇదే అదనుగా ఏవోబీలో కూంబింగ్, గిరిజనుల ఇళ్లల్లో తనిఖీలు ముమ్మరం చేశారన్నారు. పోలీసులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని అరుణ కోరారు.