Chittoor: కాణిపాకంలో ఉభయదారులు చేపట్టిన మహాధర్నా భగ్నం
ABN , First Publish Date - 2021-07-19T17:08:32+05:30 IST
కాణిపాకం ఆలయ బోర్డు చైర్మన్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ కాణిపాకంలో ఉభయ దారులు చేపట్టిన మహా
చిత్తూరు: కాణిపాకం ఆలయ బోర్డు చైర్మన్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ కాణిపాకంలో ఉభయ దారులు చేపట్టిన మహా ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. కరోనా కేసులు పెరుగుతున్ననేపథ్యంలో ధర్నా కార్యక్రమానికి అనుమతిలేదని పోలీసులు నిరాకరించారు. ఎక్కడికక్కడ ఉభయ దారులను గృహనిర్బంధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తుగా పోలీసులు మొహరించారు. దీంతో కాణిపాకం ఆలయ పరిసర ప్రాంతాలు పోలీసుల వలయంలోకి వెళ్లాయి.