సోషల్‌ మీడియాలో.. ‘సీఐడీ’ సునీల్‌ వీడియోలు మాయం!

ABN , First Publish Date - 2021-06-11T08:47:24+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్‌కుమార్‌పై మహారాష్ట్రకు చెందిన లీగల్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరం (ఎల్‌ఆర్‌పీఎఫ్‌) మరోసారి కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేసింది...

సోషల్‌ మీడియాలో.. ‘సీఐడీ’ సునీల్‌ వీడియోలు మాయం!

  • కేంద్రానికి ఫిర్యాదు చేయగానే తొలగింపు
  • కేంద్ర హోం శాఖకు సంతోష్‌ ఫిర్యాదు 

న్యూఢిల్లీ, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్‌కుమార్‌పై మహారాష్ట్రకు చెందిన లీగల్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరం (ఎల్‌ఆర్‌పీఎఫ్‌) మరోసారి కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేసింది. హిందువులకు వ్యతిరేకంగా, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ సామాజిక మాధ్యమాల్లో సునీల్‌ వీడియోలు, పోస్టింగులు పెట్టారని.. కేంద్రానికి తాము ఫిర్యాదు చేయగానే వాటన్నిటినీ ఆయనే తొలగించారని ఫోరం ప్రతినిధి సంతోష్‌ గురువారం ట్విటర్‌లో పేర్కొన్నారు. దీనిపై గురువారం కేంద్ర హోం కార్యదర్శికి మళ్లీ ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.


Updated Date - 2021-06-11T08:47:24+05:30 IST