అధికారులు కార్మికులకు అందుబాటులో ఉండాలి
ABN , First Publish Date - 2021-12-08T05:11:27+05:30 IST
కార్మిక శాఖ అధికారులు అందుబాటులో లేకపోవడంతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఐటీయూ కొవ్వూరు కమిటి కార్యదర్శి ఎం.సుందర్ బాబు విమర్శించారు.
కొవ్వూరు, డిసెంబరు 7: కార్మిక శాఖ అధికారులు అందుబాటులో లేకపోవడంతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఐటీయూ కొవ్వూరు కమిటి కార్యదర్శి ఎం.సుందర్ బాబు విమర్శించారు. పనిదినాలలో కార్మిక శాఖ కార్యాలయం రెండు రోజులుగా మూసి ఉండడంతో మంగళవారం ధర్నా నిర్వహించారు. పనిదినాలలో కార్మిక శాఖ కార్యాలయం తెరచి, అధికారులందరూ అందుబాటులో ఉండాలని డిమాండ్ చేశారు. మద్దుకూరి దొరయ్య, మాణిక్య రెడ్డి, హరిబాబు, జొన్నల రాంబాబు, నేతల ఈశ్వరరావు, బండారు అప్పలనాయుడు, అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు.