ఎమ్మెల్యే రాజన్నదొరకు సీఎం జగన్ పరామర్శ
ABN , First Publish Date - 2021-02-25T04:53:58+05:30 IST
మాతృ వియోగంతో బాధపడుతున్న సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొరను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం ఫోన్ ద్వారా పరామర్శించారు.
సాలూరు రూరల్, ఫిబ్రవరి 24: మాతృ వియోగంతో బాధపడుతున్న సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొరను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం ఫోన్ ద్వారా పరామర్శించారు. ‘నేనున్నాను ధైర్యంగా ఉండాలి’ అని తెలిపారు. మునిసిపల్ ఎన్నికల అనంతరం కలుస్తానని ఎమ్మెల్యే రాజన్నదొర చెప్పారు. సాలూరు: విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ బుధవారం ఎమ్మెల్యే రాజన్నదొరను ఆయన స్వగృహంలో కలిసి పరామర్శించారు. మాతృమూర్తి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.