యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటన
ABN , First Publish Date - 2021-10-19T19:38:48+05:30 IST
యాదాద్రి-భువనగిరి: ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రిలో పర్యటిస్తున్నారు.
యాదాద్రి-భువనగిరి: ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రిలో పర్యటిస్తున్నారు. శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం బాలాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎం కేసీఆర్కు తీర్థ ప్రసాదాలు, వేదాశీర్వచనాలు అందజేశారు. ఆలయ పునర్నిర్మాణం పనులు పూర్తిస్థాయిలో ముగిసిన నేపథ్యంలో అన్నింటిని మరోసారి పరిశీలిస్తారు. ఆలయ పునఃప్రారంభ తేదీని ప్రకటిస్తారు. మహా సుదర్శన యాగం వివరాలు, తేదీని కూడా ముఖ్యమంత్రి ప్రకటించనున్నారు. కాగా సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.