సీఎం కేసీఆర్‌ ఫొటో మార్ఫింగ్‌.. ఠాణాలో ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-06-13T12:51:30+05:30 IST

సీఎం కేసీఆర్‌ను కించపరిచేలా ఫొటోలు మార్ఫింగ్‌ చేసి

సీఎం కేసీఆర్‌ ఫొటో మార్ఫింగ్‌.. ఠాణాలో ఫిర్యాదు

హైదరాబాద్ సిటీ/హిమాయత్‌నగర్‌ : సీఎం కేసీఆర్‌ను కించపరిచేలా ఫొటోలు మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రగతిభవన్‌ ఉద్యోగి సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌లో పనిచేసే అక్షయ్‌కుమార్‌ అనే వ్యక్తి దీనిపై ఆధారాలతో ఫిర్యాదు చేశాడని సైబర్‌క్రైం ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Updated Date - 2021-06-13T12:51:30+05:30 IST