తండ్రి జయంతి వేడుకల్లో సీఎం సతీమణి భారతీరెడ్డి
ABN , First Publish Date - 2022-01-24T04:55:47+05:30 IST
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహర్రెడ్డి మామ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి 73వ జయంతి వేడుకల్లో భారతీరెడ్డి పాల్గొన్నారు.
పులివెందుల టౌన్, జనవరి 23: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహర్రెడ్డి మామ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి 73వ జయంతి వేడుకల్లో భారతీరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం పులివెందులలోని గంగిరెడ్డి సమాధి వద్ద గంగిరెడ్డి భార్య సుగుణమ్మ, కుమార్తె సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి, కొడుకు దినే్షకుమార్రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొని నివాళులు అర్పించారు. ప్రార్థనలు నిర్వహించారు. అలాగే పులివెందుల మార్కెట్ యార్డులో వైసీపీ నేత వైఎస్ మదన్మోహన్రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిన్నప్ప డాక్టర్ ఈసీ గంగిరెడ్డి జయంతి సం దర్భంగా కేక్ కట్ చేశారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పులివెందులలో డాక్టర్ ఈసీ గంగిరెడ్డి వైద్యసేవలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారని, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు సిబ్బంది, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.