పాప్కార్న్తో జలుబు మాయం!
ABN , First Publish Date - 2020-03-20T19:46:52+05:30 IST
జలుబు చేసినట్లు అనిపించగానే ఏ ట్యాబ్లెట్ కోసమో మందులషాపుకు పరుగులు తీయకుండా పాప్కార్న్ తిని చూడమంటున్నారు పెన్సిల్వేనియా పరిశోధకులు. పాప్కార్న్లో
ఆంధ్రజ్యోతి(20-03-2020):
జలుబు చేసినట్లు అనిపించగానే ఏ ట్యాబ్లెట్ కోసమో మందులషాపుకు పరుగులు తీయకుండా పాప్కార్న్ తిని చూడమంటున్నారు పెన్సిల్వేనియా పరిశోధకులు. పాప్కార్న్లో పాలీఫినాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ పాళ్లు ఎక్కువగా ఉంటాయనీ, అవి జలుబును తగ్గిస్తాయని వారు స్పష్టం చేస్తున్నారు. అంతే కాకుండా పాప్కార్న్లో లభ్యమయ్యే యాంటీఆక్సిడెంట్స్ మోతాదులు కొన్ని పండ్ల నుంచి లభ్యమయ్యే వాటి కంటే కూడా చాలా ఎక్కువని వారు చెబుతున్నారు. పాప్కార్న్ తినే సమయంలో అందులో ఉప్పు వేసుకోకపోవడం చాలా మంచిదని వారు సూచిస్తున్నారు. ఉప్పు వేయడం వల్ల పాప్కార్న్ వల్ల కలిగే ప్రయోజనాలు తగ్గిపోతాయని, పైగా కొత్త సమస్యలు వస్తాయని వారు హెచ్చరిస్తున్నారు.