రిమ్స్‌లో ఎస్‌ఏఆర్‌ఐ కేసులకు వెంటనే స్వాబ్‌ పరీక్షలు : కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-07-15T10:57:57+05:30 IST

రిమ్స్‌లో ఉన్న సీనియర్‌ అక్యూట్‌ రెస్పిరేటర్‌ ఇల్నెస్‌ (ఎస్‌ఏఆర్‌ఐ) కేసులకు వెంటనే కోవిడ్‌ పరీక్షలు ని..

రిమ్స్‌లో ఎస్‌ఏఆర్‌ఐ కేసులకు   వెంటనే స్వాబ్‌ పరీక్షలు : కలెక్టర్‌

కడప(కలెక్టరేట్‌), జూలై 14: రిమ్స్‌లో ఉన్న సీనియర్‌ అక్యూట్‌ రెస్పిరేటర్‌ ఇల్నెస్‌ (ఎస్‌ఏఆర్‌ఐ) కేసులకు వెంటనే కోవిడ్‌ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్‌ హరికిరణ్‌ రిమ్స్‌ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం జేసీ (అభివృద్ధి) సాయికాంత్‌ వర్మ, రిమ్స్‌ డైరెక్టర్‌ డా.ప్రసాదరావుతో కలసి రిమ్స్‌ ఆసుపత్రిలోని ఆస్తమా, ఛాతీ, స్వైన్‌ ప్లూ వార్డుల్లో ఏర్పాటు చేసిన కరోనా వైరస్‌ ఐసోలేషన్‌ వార్డులో ఉన్న పేషంట్లకు అందుతున్న వైద్య సేవల గురించి కలెక్టర్‌ ఆరా తీశారు. వైద్య సేవలు ఎలా అందుతున్నాయని పేషంట్లను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఫీవర్‌ కేసులపై వైద్యులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అనంతరం వివిధ అంశాలపై వైద్యులకు, నర్సులకు పలు సూచనలు జారీ చేశారు.

Updated Date - 2020-07-15T10:57:57+05:30 IST