రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి

ABN , First Publish Date - 2021-07-31T05:35:06+05:30 IST

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు.

రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, పాల్గొన్న జేసీ, డీఆర్వో

కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌

గుంటూరు(తూర్పు), జూలై30: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీసీ సమావేశ మందిరంలో జిల్లాలోని భూసమస్యలపై శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యలకు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చిన ఫిర్యాదులపై త్వరితగతిన విచారణ జరిపి పరిష్కరించాలని సూచించారు. జాయింట్‌ కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ ఆనలైనలో రెవెన్యూ వివరాలను నమోదు చేసే సమయంలో సాంకేతిక లోపాలను సరిచేయడానికి రూపొందించిన ఎస్‌వోపీ విధానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్వో కొండయ్య, కలెక్టరేట్‌ ఏవో సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-31T05:35:06+05:30 IST