ఈవీఎంలను పరిశీలించిన కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-08-13T10:52:24+05:30 IST

ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో కలెక్టర్‌ కార్యాలయ

ఈవీఎంలను పరిశీలించిన కలెక్టర్‌

నల్లగొండ టౌన్‌, ఆగస్టు 12 : ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలోని ఈవీఎం గోదాంలను బుధవారం తనిఖీ చేశారు.  2006కు ముందు తయారుచేసిన ఈఎం-1 మోడల్‌ ఈవీఎంలను ఎన్నికల సంఘం ఆదేశానుసారం తిరుపతికి పంపించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వి.చంద్రశేఖర్‌, ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్‌ నాగార్జున్‌, ఏవో మోతీలాల్‌, డీటీటీ విజయ్‌కుమార్‌, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-13T10:52:24+05:30 IST