‘సాగు బాగు కోసం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-12-02T04:19:35+05:30 IST

వ్యవసాయశాఖ తయారు చేసిన ‘సాగు బాగుకోసం’ పుస్తకాన్ని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ జిల్లా వ్యవసాయాధికారి శ్రీని వాసరావు తోకలిసి బుధవారం ఆవిష్కరించారు.

‘సాగు బాగు కోసం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్‌
కలెక్టర్‌కు వినతి పత్రం అందజేస్తున్న జడ్పీటీసీ, విద్యార్థులు

ఆసిఫాబాద్‌, డిసెంబరు 1: వ్యవసాయశాఖ తయారు చేసిన ‘సాగు బాగుకోసం’ పుస్తకాన్ని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ జిల్లా వ్యవసాయాధికారి శ్రీని వాసరావు తోకలిసి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాసంగిలో రైతులు వరికి బదు లుగా పప్పు దినుసులైన పెసర, మినుము, పొద్దు తిరుగుడు, వేరుశనగపంటలను సాగుచేయాలన్నారు. ఏడీఏవెంకట్‌, మిలింథ్‌, ఏవోలు,ఏఈవోలు పాల్గొన్నారు.

ఆట స్థలం కేటాయించాలి..

పట్టణంలోని జన్కాపూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆటస్థలం కేటాయించాలని జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌ రావు, విద్యార్థులు కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌కు బుధవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలస్థలం ఆక్రమణలకు గురైందని, ప్రస్తుతం విద్యార్థులకు ఆటస్థలం లేకుండా పోయిం దని విన్నవించారు. స్పందించిన కలెక్టర్‌ ప్రస్తుతానికి ఖాళీగా ఉన్న స్థలంలో ఆటలు ఆడించాలని ఉపాధ్యా యులకు సూచించారు. ప్రధానోపాధ్యాయుడు సుభాష్‌ బాబు, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య, రాజేష్‌ ఉన్నారు.

Updated Date - 2021-12-02T04:19:35+05:30 IST