ఐదు నెలల క్రితం ఎంగేజ్‌మెంట్.. వేరొక అమ్మాయితో వరుడు జంప్.. తిరిగి వచ్చి పెళ్లి చేసుకుందామని బలవంతం.. యువతి అంగీకరించకపోవడంతో..

ABN , First Publish Date - 2021-12-02T21:52:51+05:30 IST

ఆ యువతికి ఐదు నెలల క్రితం ఓ యువకుడితో నిశ్చితార్థం జరిగింది.. పెళ్లి ముహూర్తం కూడా పెట్టుకున్న తర్వాత వేరొక అమ్మాయితో వరుడు వెళ్లిపోయాడు..

ఐదు నెలల క్రితం ఎంగేజ్‌మెంట్.. వేరొక అమ్మాయితో వరుడు జంప్.. తిరిగి వచ్చి పెళ్లి చేసుకుందామని బలవంతం.. యువతి అంగీకరించకపోవడంతో..

ఆ యువతికి ఐదు నెలల క్రితం ఓ యువకుడితో నిశ్చితార్థం జరిగింది.. పెళ్లి ముహూర్తం కూడా పెట్టుకున్న తర్వాత వేరొక అమ్మాయితో వరుడు వెళ్లిపోయాడు.. దీంతో యువతి కుటుంబం ఎంగేజ్‌మెంట్ రద్దు చేసుకుంది.. తిరిగి వచ్చిన ఆ యువకుడు మళ్లీ యువతితో మాటలు ప్రారంభించాడు.. పెళ్లి చేసుకుందామని బలవంతం చేశాడు.. ఆ యువతి అందుకు అంగీకరించలేదు.. బుధవారం రాత్రి ఆ యువతి హత్యకు గురైంది.. ఆ యువకుడే ఈ పని చేసి ఉంటాడని అందరూ అనుమానిస్తున్నారు.. రాజస్థాన్‌లోని జైపూర్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది. 


జైపూర్‌కు సమీపంలోని ప్రాగ్‌పూర్ గ్రామానికి చెందిన మనీషా మీనా అనే యువతికి అదే గ్రామానికి చెందిన మనోజ్ రాజ్‌తో ఐదు నెలల క్రితం వివాహం నిశ్చయమైంది. ఐదు నెలల క్రితం ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. అయితే ఎంగేజ్‌మెంట్ తర్వాత మనోజ్ రాజ్ వేరే యువతిని తీసుకుని ఊరి నుంచి పరారయ్యాడు. దీంతో మనీషా మీనా కుటుంబం ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకుంది. నెల రోజుల క్రితం గ్రామానికి తిరిగి వచ్చిన మనోజ్ మళ్లీ మనీషా వెంట తిరగడం ప్రారంభించాడు. పెళ్లి చేసుకుందామని బలవంతం చేయడం ప్రారంభించాడు. 


మనోజ్ ప్రతిపాదనను మనీషా తిరస్కరించింది. కాగా, బుధవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన మనీషా హత్యకు గురైంది. ఇంటికి 150 మీటర్ల దూరంలో మనీషా మృతదేహం ఈ రోజు (గురువారం) ఉదయం కనిపించింది. ఆమెను ఎవరో గొంతు కోసి హత్య చేశారు. మనీషాను మనోజే హత్య చేసి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మనోజ్ కోసం అన్వేషిస్తున్నారు. 

Updated Date - 2021-12-02T21:52:51+05:30 IST