గ్రేడ్‌-2 వీఆర్వోల సంఘ కార్యవర్గం ఎన్నిక

ABN , First Publish Date - 2022-01-24T05:00:55+05:30 IST

గ్రేడ్‌-2 వీఆర్వోల సంఘం జిల్లా నూతన కార్యవరాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా టి.శంకర్‌, ప్రధాన కార్యదర్శిగా సి.యోగానంద్‌, కోశాధికారిగా ఎ.కందస్వామి, ఉపాధ్యక్షులుగా పి.చంద్రబాబు, ఎ.నరసింహారెడ్డి, ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా మధుబాబు, సంయుక్త కార్యదర్శిగా ఎం.ప్రకాశంను ఎన్నుకున్నారు.

గ్రేడ్‌-2 వీఆర్వోల సంఘ కార్యవర్గం ఎన్నిక
నూతన కార్యవర్గ సభ్యులు

చిత్తూరు, జనవరి 23: గ్రేడ్‌-2 వీఆర్వోల సంఘం జిల్లా నూతన కార్యవరాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా టి.శంకర్‌, ప్రధాన కార్యదర్శిగా సి.యోగానంద్‌, కోశాధికారిగా ఎ.కందస్వామి, ఉపాధ్యక్షులుగా పి.చంద్రబాబు, ఎ.నరసింహారెడ్డి, ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా మధుబాబు, సంయుక్త కార్యదర్శిగా ఎం.ప్రకాశంను ఎన్నుకున్నారు. అదేవిధంగా తిరుపతి డివిజన్‌ అధ్యక్షుడుగా కె.డిల్లీకుమార్‌, ఉపాధ్యక్షుడుగా బి.మురళీబాబు, కోశాధికారిగా పి.రమేష్‌, చిత్తూరు డివిజన్‌ డివిజన్‌ అధ్యక్షుడుగా బి.రవి, ఉపాధ్యక్షురాలుగా కె.ఉమ, కార్యదర్శిగా టీఎం.శివాజీ, సంయుక్త కార్యదర్శిగా గోవిందరెడ్డి, కోశాధికారి పి.చిరంజీవి నాయుడును ఎన్నుకున్నారు. మదనపల్లె డివిజన్‌ అధ్యక్షుడుగా టి.సుధాకర్‌, ఉపాధ్యక్షుడుగా మహేష్‌, కార్యదర్శిగా జి.నరేంద్రబాబు, సంయుక్త కార్యదర్శిగా ఎ.ఫకీషావళి, కోశాధికారిగా రమణను ఎన్నుకున్నారు.

Updated Date - 2022-01-24T05:00:55+05:30 IST