బీజేపీ కార్యాలయం ఎదుట గన్ఫౌండ్రీ కార్యకర్తల ఆందోళన
ABN , First Publish Date - 2020-11-22T20:45:01+05:30 IST
బీజేపీ కార్యాలయం ఎదుట గన్ఫౌండ్రీ కార్యకర్తల ఆందోళన
హైదరాబాద్: గన్ఫౌండ్రీ బీజేపీ అభ్యర్థి ఓంప్రకాష్పై దాడికి యత్నించిన శైలేందర్ యాదవ్ వర్గీయులకు వ్యతిరేకంగా బీజేపీ కార్యాలయం ఎదుట గన్ఫౌండ్రీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. టీడీపీ నుంచి వచ్చిన ఓంప్రకాష్కు టికెట్ ఇవ్వడంపై శైలేందర్ వర్గీయుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజాసింగ్పై కిషన్రెడ్డి, లక్ష్మణ్ కక్షగట్టారని శైలేంద్రయాదవ్ ఆరోపించారు. వరుస విజయాలతో బీజేపీని రాష్ట్రంలో కాపాడుకుంటూ వస్తున్న రాజాసింగ్ను పక్కన పెట్టడం పార్టీకి మంచిది కాదని ఆయన అన్నారు.