కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం
ABN , First Publish Date - 2021-10-24T05:03:36+05:30 IST
కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం లోకి వస్తుందని డీసీసీ అఽధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు.
- డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్
మహబూబ్నగర్, అక్టోబరు 23 : కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం లోకి వస్తుందని డీసీసీ అఽధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్కు పూర్వవైభవం వస్తున్నదని చెప్పారు. డీసీసీ కార్యాల యంలో శనివారం పట్టణంలోని 40, 41వ వార్డులకు చెందిన పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా కొత్వాల్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ను ఆదరించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీలో పెద్దఎత్తున చేరికలు జరుగుతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై పార్టీ శ్రేణులు పోరాడాలని, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి పార్టీపై భరోసా కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బెక్కరి అనిత, సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, ఎన్పీ వెంకటేశ్, సీజె బెనహర్, జె చంద్రశేఖర్, సిరాజ్ఖాద్రి, శివశంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.