కౌలు రైతులకు నష్ట పరిహారం అయినా ఇవ్వాలి: Bhatti

ABN , First Publish Date - 2021-10-08T16:33:42+05:30 IST

వర్షాల కారణంగా చాలా చోట్ల పంటలు దెబ్బ తిన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క అన్నారు.

కౌలు రైతులకు నష్ట పరిహారం అయినా ఇవ్వాలి: Bhatti

హైదరాబాద్: వర్షాల కారణంగా చాలా చోట్ల పంటలు దెబ్బ తిన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడుతూ మంథని, మధిర నియోజకవర్గ ల్లో వదల కారణంగా పంటలు ముంపునకు గురయ్యాయని తెలిపారు. 2015లో మాత్రమే పంటకు ఇన్‌ఫుట్ సప్సీడీ ఇచ్చామని... తప్పితే ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. పంట నష్టం మీద అంచనా వేసి కేంద్రనికి పంపితే ఎంతోకొంత సహాయం అందుతుందని చెప్పారు. 52శాతం రాష్ట్రంలో కౌలు రైతులు ఉన్నారని... వారికి రైతు బంధు రావడం లేదు కాబట్టి కనీసం నష్ట పరిహారం అయినా ప్రభుత్వం ఇవ్వాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-10-08T16:33:42+05:30 IST