విద్యార్థి నాయకుల అరెస్ట్‌లను ఖండించిన శైలజానాథ్

ABN , First Publish Date - 2021-07-19T19:17:53+05:30 IST

విద్యార్థి నాయకుల అక్రమ అరెస్టులను ఏపీసీసీ అధ్యక్షులు డా సాకే శైలజానాథ్ ఖండించారు.

విద్యార్థి నాయకుల అరెస్ట్‌లను ఖండించిన శైలజానాథ్

అమరావతి: విద్యార్థి నాయకుల అక్రమ అరెస్టులను ఏపీసీసీ అధ్యక్షులు డా సాకే శైలజానాథ్ ఖండించారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌పై శాంతియుతంగా మాట్లాడటానికి వెళ్తున్న విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయటం దారుణమన్నారు. విద్యార్థుల అరెస్టుల పరిస్థితి చూస్తుంటే ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా? లేక... నియంతృత్వ పాలనలో ఉన్నామా అర్థంకాకుండా ఉందని వ్యాఖ్యానించారు. లక్షలాది మంది విద్యార్థులు చదువులు చదివి ఉద్యోగాల కోసం పడిగాపులు కాస్తుంటే ఉద్యోగాలు కల్పించలేని  ప్రభుత్వం, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్ధులపై కనికరం లేకుండా, మానవత్వం లేకుండా అక్రమ అరెస్టులు చేయడం శోచనీయమని శైలజానాథ్ మండిపడ్డారు.

Updated Date - 2021-07-19T19:17:53+05:30 IST