రైతుల నడ్డి విరుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2021-10-13T19:17:47+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నడ్డి విరుస్తున్నాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు.

రైతుల నడ్డి విరుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు: తులసిరెడ్డి

అమరావతి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నడ్డి విరుస్తున్నాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు.  మోడీ పాలనలో ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. మ్యూరైట్ ఆఫ్ పోటాష్ 50 కిలోల బస్తా ధర ఏప్రిల్ నెలలో రూ.875లు ఉండగా, ప్రస్తుతం రూ.1650లు అయ్యిందని తెలిపారు. జగన్ పాలనలో రైతులు పండించే ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లభించడం లేదని విమర్శించారు. రైతు భరోసా కేంద్రాలు రైతు నిరాశా కేంద్రాలుగా తయారు అయ్యాయన్నారు. జగన్ పాలనలో బిందు, తుంపర సేద్యం అటకేక్కిందన్నారు. సున్నా వడ్డీ పథకానికి సున్నం పెట్టిందని...పావలా వడ్డీ పథకానికి పాడె కట్టిందని...వ్యవసాయ మోటార్లకు మీటర్లు రైతుల మెడలకు ఉరితాళ్లని వ్యాఖ్యానించారు. బద్వేలు ఉప ఎన్నికల్లో బీజేపీ, వైసీపీ పార్టీలను ఓడించడమే దీనికి పరిష్కారమని తులసిరెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-13T19:17:47+05:30 IST