కంప్లయింట్ ఇవ్వడానికి వస్తే.. ఏకంగా కాపురమే పెట్టేశాడు.. ఈ కానిస్టేబుల్ చేసిన పని చివరకు ఎంత వరకు వెళ్లిందంటే..

ABN , First Publish Date - 2022-02-27T22:51:17+05:30 IST

ఓ మహిళ తన సమస్యలపై కంప్లయింట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్లింది. బాధితురాలి బలహీనతను అవకాశంగా తీసుకున్న ఆ కానిస్టేబుల్.. ఆమెతో ఏకంగా కాపురమే పెట్టేశాడు. ఇతడు చేసిన పని చివరకు..

కంప్లయింట్ ఇవ్వడానికి వస్తే.. ఏకంగా కాపురమే పెట్టేశాడు.. ఈ కానిస్టేబుల్ చేసిన పని చివరకు ఎంత వరకు వెళ్లిందంటే..
ప్రతీకాత్మక చిత్రం

సమాజంలో ఎక్కడ ఎవరికి ఎలాంటి అన్యాయం జరిగినా.. పోలీసులు ఉన్నారనే ధైర్యంతో ఉంటారు. పోలీస్ స్టేషన్ కి వెళ్తే న్యాయం జరుగుతుందనే నమ్మకంతో వెళ్తారు. బాధితులకు భరోసా ఇస్తూ చాలా మంది పోలీసులు వారికి న్యాయం చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం బాధితుల బలహీనతను అవకాశంగా తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. ఓ మహిళ తన సమస్యలపై కంప్లయింట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్లింది. బాధితురాలి బలహీనతను అవకాశంగా తీసుకున్న ఆ కానిస్టేబుల్.. ఆమెతో ఏకంగా కాపురమే పెట్టేశాడు. ఇతడు చేసిన పని చివరకు ఎంతవరకు వెళ్లిందంటే..


కర్ణాటక రాష్ట్రం మైసూరు పరిధి టి.నరిసిపుర తాలూకా బన్నూరు పీఎస్ పరిధిలో నివాసం ఉంటున్న ఓ కుటుంబంలోని భార్యాభర్తల మధ్య ఇటీవల గొడవలు తలెత్తాయి. రోజురోజుకూ గొడవలు ఎక్కువవడంతో విసిగిపోయిన మహిళ.. భర్తపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కి వెళ్లింది. హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న సి.కృష్ణకు విషయం తెలియజేసింది. విచారణ పేరుతో ఆమెకు దగ్గరైన కృష్ణ.. ఎలాగైనా మహిళను తన దారిలోకి తెచ్చుకోవాలని పథకం పన్నాడు. మాయమాటలు చెప్పి నమ్మించి.. చివరకు మైసూరు తీసుకెళ్లి కాపురం పెట్టాడు. ఈ క్రమంలో ఆమె పేరుతో రూ.5లక్షల ఋణం కూడా తీసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని మహిళ ఒత్తిడి చేసింది. దీంతో ఆమెను బెదిరించడం మొదలెట్టాడు. ఒక్కోసారి ఆమెను తీవ్రంగా కొట్టేవాడు. మోసపోయానని గ్రహించిన మహిళ.. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఒంటరి గదిలో ప్రియురాలికి దోశ తినిపిస్తోన్న ప్రియుడు.. అంతలో ఉన్నట్టుండి ఊహించని ఘటన.. చివరికి ఏం జరిగిందంటే..



Updated Date - 2022-02-27T22:51:17+05:30 IST