కన్వాల్సెంట్ ప్లాస్మా వినియోగానికి ఓకే
ABN , First Publish Date - 2020-07-03T07:34:07+05:30 IST
కన్వాల్సెంట్ ప్లాస్మా వినియోగానికి ఓకే
న్యూఢిల్లీ, జూలై 2: స్టెరాయిడ్స్ వినియోగిస్తున్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడని స్వల్ప లక్షణాలు ఉండే కరోనా రోగుల చికిత్స కోసం కన్వాల్సెంట్ ప్లాస్మాను పరిగణనలోకి తీసుకోవచ్చని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎ్ససీవో) ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా చికిత్సకు సంబంధించి గత నెల 27న కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల్లో .. కోవిడ్ లక్షణాలు మధ్యస్తంగా ఉండే వారికి ప్రయోగాత్మకంగా కన్వాల్సెంట్ ప్లాస్మా ఉపయోగానికి అనుమతినిచ్చింది. దీని దృష్టిలో పెట్టుకొని సీడీఎ్ససీవో బుధవారం ఈ ప్రకటన జారీ చేసింది.