పోలీసుల నివేదికల ప్రతులు నిందితులకూ ఇవ్వాలి: హైకోర్టు

ABN , First Publish Date - 2020-07-01T08:28:24+05:30 IST

ఏదైనా కేసులో బెయిలు కోసం దాఖలైన వ్యాజ్యంలో జైలు అధికారులు, పోలీసుల నుంచి కోర్టులు నివేదిక కోరిన సందర్భంలో సదరు నివేదిక ప్రతిని నిందితుడికి తప్పనిసరిగా ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది...

పోలీసుల నివేదికల ప్రతులు నిందితులకూ ఇవ్వాలి: హైకోర్టు

ఏదైనా కేసులో బెయిలు కోసం దాఖలైన వ్యాజ్యంలో జైలు అధికారులు, పోలీసుల నుంచి కోర్టులు నివేదిక కోరిన సందర్భంలో సదరు నివేదిక ప్రతిని నిందితుడికి తప్పనిసరిగా ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అందరికీ న్యాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఈ కనీస చర్యను తప్పకుండా తీసుకోవాలని కోర్టు సూచించింది. సీజే డీఎన్‌ పటేల్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ ఏదైనా కేసులో యథార్థ నివేదిక ప్రతిని నిందితుడికి(పిటిషనర్‌కు) ఇవ్వకపోతే కోర్టు ఇచ్చే ఉత్తర్వులలో దానికి కారణాలను కూడా  వివరించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఏదైనా కేసులో దర్యాప్తు అధికారి లేదా జైలు సూపరింటెండెంట్‌ నివేదికలను సాధ్యమైనంత ముందుగా కోర్టుకు సమర్పించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ఈ నివేదికల ప్రతులను నిందితులకు కూడా ముందుగా ఇవ్వాలని, అప్పుడు వారు తమ కేసును కోర్టులో సమర్థవంతంగా వాదించుకోవడానికి వీలవుతుందని ధర్మాసనం పేర్కొంది. 


Updated Date - 2020-07-01T08:28:24+05:30 IST