ఢిల్లీలో 14వేలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-05-25T23:27:38+05:30 IST

దేశాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. ఈ క్రమంలో దేశరాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 635 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఢిల్లీలో 14వేలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. ఈ క్రమంలో దేశరాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 635 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఢిల్లీ ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. దీంతో మొత్తం ఢిల్లీలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 14,053కు చేరింది. వీటిలో 7,006 యాక్టివ్ కేసులుకాగా, 6,711మంది కరోనా బాధితులు కోలుకున్నట్లు తెలుస్తోంది. అలాగే కొత్తగా 15 కరోనా మరణాలు సంభవించడంతో ఢిల్లీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 276కు చేరింది.

Updated Date - 2020-05-25T23:27:38+05:30 IST