గుంటూరు జిల్లాలో కొత్తగా 595మందికి కరోనా..
ABN , First Publish Date - 2020-08-14T13:18:28+05:30 IST
జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గురువారం సాయంత్రం వరకు..
జిల్లాలో కొనసాగుతున్న కరోనా ఉధృతి
గుంటూరు నగరంలో 189
కరోనాతో ఆర్ఎంపీ, విశ్రాంత ఉపాధ్యాయుడు మృతి
తాడికొండ మండలంలో ఓ పంచాయతీ కార్యదర్శి
గుంటూరు(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గురువారం సాయంత్రం వరకు అందిన రిపోర్టుల ప్రకారం కొత్తగా మరో 595 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లాలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 26,032కి చేరుకొంది. గుంటూరు నగరంలో కొత్తగా 189మందికి కరోనా నిర్ధారించారు. జిల్లావ్యాప్తంగా 50 మండలాల్లో కేసులు నమోదు అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె.యాస్మిన్ తెలిపారు. నరసరావుపేటలో గురువారం 33మందికి కరోనా సోకింది. వీరిలో పట్టణంలో 24మంది, మండలంలోని వివిధ గ్రామాల్లో 9మంది ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలో గురువారం 10మందికి, మండలంలో 6, నాదెండ్ల మండలంలో 5, యడ్లపాడు మండలంలో 23మందికి పాజిటివ్ వచ్చింది.