దేశంలో కొత్తగా 42,766 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-07-10T15:52:13+05:30 IST
దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత కొనసాగుతోంది. దేశంలో కొత్తగా 42,766 కరోనా కేసులు నమోదు అవగా...
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత కొనసాగుతోంది. దేశంలో కొత్తగా 42,766 కరోనా కేసులు నమోదు అవగా... 1,206 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,95,716కి చేరింది. అలాగే మొత్తం 4,07,145 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,55,033 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 92.20 శాతానికి పెరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 37.21 కోట్ల మందికి టీకా పంపిణీ జరిగింది.