దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 30,948 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-08-22T16:30:29+05:30 IST
దేశ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 30,948 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 30,948 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే 403 మంది మృతి చెందారు. ప్రస్తుతం కరోనా నుంచి కోలుకుని 38,487 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 3,24,24,234కి చేరింది. కోలుకున్న వారి సంఖ్య 3,16,36,469గా ఉంది. ప్రస్తుతం 3,53,398 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,34,367గా నమోదు అయ్యింది. దేశ వ్యాప్తంగా 58,14,89,377మంది టీకా తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది.