కృష్ణా జిల్లాలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే..

ABN , First Publish Date - 2021-07-12T16:07:13+05:30 IST

జిల్లాలో కరోనా ప్రభావం..

కృష్ణా జిల్లాలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే..

మరో బాధితుడు మృతి 


విజయవాడ(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది. వైరస్‌ బారినపడి కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో బాధితుడు ఆదివారం మృతి చెందాడు. గడచిన 24గంటల్లో 7,626 మందికి పరీక్షలు నిర్వహించగా.. 281 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వీఎంసీ పరిధిలో 29, విజయవాడ రూరల్‌ డివిజన్‌లో 150, నూజివీడు డివిజన్‌లో 66, మచిలీపట్నం డివిజన్‌లో 23, గుడివాడ డివిజన్‌లో 13 మందికి పాజిటివ్‌గా తేలింది. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసులు 1,04,210 కి పెరిగాయి. కరోనా మరణాలు 1,153 కు చేరుకున్నాయి. ఇంకా 2,923 మంది పాజిటివ్‌ బాధితులు కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2021-07-12T16:07:13+05:30 IST