42 పీహెచ్సీల్లో పెరుగుతున్న కేసులు
ABN , First Publish Date - 2021-09-15T06:50:41+05:30 IST
జిల్లాలోని 42 పీహెచ్సీల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు.
చిత్తూరు కలెక్టరేట్, సెప్టెంబరు 14: జిల్లాలోని 42 పీహెచ్సీల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. మంగళవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా పాజిటివిటీ 3.14 శాతం నుంచి మంగళవారానికి 3.26 శాతానికి పెరిగినట్లు చెప్పారు. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించడంలో ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం కారణంగానే కేసులు అధికమవుతున్నాయన్నారు. మరో రెండు, మూడ్రోజుల్లో భారీగా వ్యాక్సిన్ డోసులు జిల్లాకు వస్తున్నట్లు పేర్కొన్నారు. 45 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి స్థాయిలో జరగలేదని, కొన్ని ప్రాంతాల్లో గర్భిణులు వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రావడం లేదని అధికారులు వివరించారు.