దేశంలో 76 లక్షలు దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-10-21T16:11:00+05:30 IST

ఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. అయితే రికవరీ రేటు పెరుగుతుండటం..

దేశంలో 76 లక్షలు దాటిన కరోనా కేసులు

ఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. అయితే రికవరీ రేటు పెరుగుతుండటం.. మరణాల సంఖ్య తగ్గుతుండటం కాస్త ఊరటనిస్తోంది. గతంతో పోలిస్తే కేసుల సంఖ్య సైతం తగ్గిపోయింది. కరోనా కేసులు 76 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 54,044 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 717 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 76,51,107కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తంగా 1,15,914 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 7,40,090 యాక్టివ్ కేసులున్నాయి. 67,95,103 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 88.81 శాతం కాగా.. మరణాల రేటు 1.51 శాతంగా ఉంది.


Updated Date - 2020-10-21T16:11:00+05:30 IST