కరోనా ఎఫెక్ట్.. బెంగళూరులో భారీగా తగ్గిన కాలుష్యం

ABN , First Publish Date - 2020-03-30T14:23:28+05:30 IST

కరోనా దెబ్బకు కాలుష్యం కూడా తోక ముడిచింది. వారం రోజులుగా బోసిపోయిన రహదారుల కారణంగా

కరోనా ఎఫెక్ట్.. బెంగళూరులో భారీగా తగ్గిన కాలుష్యం

  • 51 పాయింట్లు మెరుగు : కాలుష్య నియంత్రణ మండలి

బెంగళూరు : కరోనా దెబ్బకు కాలుష్యం కూడా తోక ముడిచింది. వారం రోజులుగా బోసిపోయిన రహదారుల కారణంగా రోడ్లు నిర్మానుష్యంగా మారిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా బెంగళూరు నగరంలో వాహనాల సంచారం దాదాపు 90 శాతానికి పైగా ని లిచిపోవడంతో వాతావరణ కాలుష్యం బాగా తగ్గింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నగరంలో ఆదివారం ఈ మే రకు ఒక ప్రకటన విడుదల చేసింది. నగరంలోని వాహనసంచారం అధికంగా ఉండే ప్రదేశాలు తాజాగా గ్రీన్‌ సింబల్‌ను చేరుకున్నాయన్నారు.

Updated Date - 2020-03-30T14:23:28+05:30 IST