కరోనాపై ఫేస్బుక్ ప్రత్యేక ప్రచార కార్యక్రమం
ABN , First Publish Date - 2021-05-14T08:06:52+05:30 IST
భారత్లో కరోనాపై ప్రజలకు కచ్చితమైన సమాచారం అందించడానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తెలిపింది....
న్యూఢిల్లీ, మే 13: భారత్లో కరోనాపై ప్రజలకు కచ్చితమైన సమాచారం అందించడానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తెలిపింది. కరోనాపై ఏదైనా సమాచారం ఫేస్బుక్లో కనిపించినప్పుడు, అదే అంశానికి సంబంఽధించిన అధీకృత వెబ్సైట్లకు లింక్ కనిపిస్తుందని, దానిపై క్లిక్ చేస్తే అది నిజమో కాదో తెలుసుకోవచ్చని పేర్కొంది. ఇందుకు ప్రత్యేక వెబ్సైట్ను రూపొందిస్తున్నట్టు తెలిపింది.