కరోనా మళ్లీ హైరానా
ABN , First Publish Date - 2020-05-28T10:46:19+05:30 IST
జిల్లాలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వస్తున్న వారి నుంచి పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి
జిల్లాలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వస్తున్న వారి నుంచి పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. లాక్డౌన్ కొంతమేర సడలించిన నేపథ్యంలో పక్క జిల్లాలు, రాష్ట్రాల్లో కూలి పనులు, ఉద్యోగాలు చేస్తున్న వారు ప్రస్తుతం తిరిగి స్వగ్రామాలకు వస్తున్నారు. వీరిని గుర్తించి అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాటిలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకూ నాలుగు పాజిటివ్లు నిర్ధారణ అయ్యాయి. మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరుకు చెందిన ఒకరికి పాజిటివ్ అని తేలగా, మరో మూడు కేసులు జిల్లాలోని వేర్వేరు మండలాల్లో నమోదయ్యాయి. చీమకుర్తి మండలం రాజుపాలెంలో ఒక కేసు, కొరిశపాడు మండలం కనగాలవారిపాలెంలో ఇంకో కేసు, సంతమాగులూరులో మరో పాజిటివ్ వెలుగు చూశాయి. దీంతో కేసుల సంఖ్య 74కు చేరింది.