జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-05-21T10:23:23+05:30 IST

జిల్లాలో తాజాగా ఇద్దరికి బుధవారం కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే ఈ ఇద్దరు మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కూలీలే కావడం గమనార్హం.

జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌

ముంబై నుంచి వచ్చిన కూలీలకు గుర్తింపు


నిర్మల్‌, మే 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో తాజాగా ఇద్దరికి బుధవారం కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే ఈ ఇద్దరు మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కూలీలే కావడం గమనార్హం. ముంబై కార్మికవాడల్లో పని చేస్తూ లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయి స్వస్థలాలకు వచ్చిన ఐదుగురిలో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. 


వారిలో నిర్మల్‌ పట్టణానికి చెందిన ఒకరు, ఖానాపూర్‌ మండలం గోడలపంపునకు చెందిన మరొకరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిద్దరిని చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ తెలిపారు. వీరిద్దరి కుటుంబ సభ్యుల తో పాటు వీరితో ముంబైౖ నుంచి వచ్చిన మరో ముగ్గురిని క్వారంటైన్‌లో ఉంచినట్లు చెప్పారు.

Updated Date - 2020-05-21T10:23:23+05:30 IST