కార్మికులకు కరోనా పాజిటివ్‌..ఆరు బనియన్‌ కంపెనీలకు సీలు

ABN , First Publish Date - 2021-05-14T16:47:22+05:30 IST

రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలుకు వచ్చినా తిరుప్పూర్‌ బనియన్‌ తయారీ కంపెనీలు పనిచేస్తున్నాయి. కుళత్తుపుదూర్‌లో...

కార్మికులకు కరోనా పాజిటివ్‌..ఆరు బనియన్‌ కంపెనీలకు సీలు

చెన్నై/పెరంబూర్: రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలుకు వచ్చినా తిరుప్పూర్‌ బనియన్‌ తయారీ కంపెనీలు పనిచేస్తున్నాయి. కుళత్తుపుదూర్‌లో ఉన్న బనియన్‌ సంస్థలో పనిచేస్తున్న 295 మందికి పరీక్షలు నిర్వహించగా 18 మందికి, సిరుపూలువపట్టిలో పనిచేస్తున్న 367 మందికి పరీక్షలు నిర్వహించగా 33 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అలాగే, మంగళం రోడ్డు కోళ్ల ఫాం సమీపంలో ఉన్న కంపెనీలో 8 మందికి, అసర్‌నగర్‌లో ఉన్న కంపెనీలో 19 మందికి, ఆండిపాళయంలో ఉన్న కంపెనీలో 32 మందికి, పల్లడం రోడ్డు గోకులకృష్ణానగర్‌లో పనిచేస్తున్న కంపెనీలో 23 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో, ఆ ఆరు కంపెనీలకు సీలు వేసిన అధికారులు మిగిలిన కార్మికులు హోం క్వారంటైన్‌లో వుండాలని సూచించారు. 

Updated Date - 2021-05-14T16:47:22+05:30 IST