229మందికి కరోనా... ఐదుగురి మృతి

ABN , First Publish Date - 2021-08-03T07:19:15+05:30 IST

జిల్లాలో ఆది, సోమవారాల నడుమ 24 గంటల్లో 229 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అదే వ్యవధిలో కొవిడ్‌తో రాష్ట్రంలోనే అత్యధికంగా ఐదుగురు మరణించారు.

229మందికి కరోనా... ఐదుగురి మృతి

 తిరుపతి, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆది, సోమవారాల నడుమ 24 గంటల్లో 229 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అదే వ్యవధిలో కొవిడ్‌తో రాష్ట్రంలోనే అత్యధికంగా ఐదుగురు మరణించారు. సోమవారం ఉదయం 9 గంటల సమయానికి జిల్లాలో 3099మంది యాక్టివ్‌ పాజిటివ్‌ బాధితులు వున్నట్టు అధికార యంత్రాంగం గుర్తించింది. కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసులు, మరణాలతో జిల్లాలో ఇప్పటి వరకూ నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 231604కు చేరగా కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 1743కు పెరిగింది. తాజా పాజిటివ్‌ కేసులు తిరుపతిలో 41, చిత్తూరులో 17, పుత్తూరులో 14, తిరుపతి రూరల్‌, చంద్రగిరి మండలాల్లో 11 చొప్పున, శ్రీకాళహస్తిలో 10, మదనపల్లె, బీఎన్‌ కండ్రిగ మండలాల్లో 8 వంతున, పుంగనూరు, యాదమరి మండలాల్లో 7 చొప్పున, వరదయ్యపాళ్యంలో 6, పీలేరు, చౌడేపల్లె, వెదురుకుప్పం మండలాల్లో 5 వంతున, తొట్టంబేడు, వాల్మీకిపురం, నారాయణవనం, తవణంపల్లె, ఐరాల మండలాల్లో 4 చొప్పున, నగరి, రేణిగుంట, కేవీపల్లె, ఎర్రావారిపాళ్యం, జీడీనెల్లూరు, కేవీబీపురం, సోమల, పులిచెర్ల, గుర్రంకొండ మండలాల్లో 3 వంతున, పెనుమూరు, కుప్పం,కార్వేటినగరం, బంగారుపాళ్యం, సదుం, విజయపురం, బైరెడ్డిపల్లె, సత్యవేడు, నాగలాపురం, బి.కొత్తకోట మండలాల్లో 2 చొప్పున, పలమనేరు, పాకాల, రామసముద్రం, వడమాలపేట, పీటీఎం, రామచంద్రాపురం, పెద్దపంజాణి మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి.

Updated Date - 2021-08-03T07:19:15+05:30 IST