780మందికి కరోనా... 9 మంది మృతి

ABN , First Publish Date - 2021-06-17T07:18:45+05:30 IST

జిల్లాలో మంగళ, బుధవారాల నడుమ 24 గంటల వ్యవధిలో 780 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

780మందికి కరోనా... 9 మంది మృతి

తిరుపతి, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంగళ, బుధవారాల నడుమ 24 గంటల వ్యవధిలో 780 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆ వ్యవధిలో రాష్ట్రంలోకెల్లా ఎక్కువగా తొమ్మిది మరణాలు సంభవించాయి. తాజా కేసులతో జిల్లాలో ఇప్పటి దాకా నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 210588కి చేరుకోగా మరణాల సంఖ్య 1487కు చేరుకుంది.బుధవారం ఉదయానికి జిల్లాలో 10232 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులున్నాయి. కాగా కొత్తగా గుర్తించిన పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 101 వున్నాయి. తిరుపతి నగరంలో 68, తిరుపతి రూరల్‌లో 52, మదనపల్లెలో 40, పీలేరులో 38, పెనుమూరులో 35, పుత్తూరులో 29, కేవీపల్లెలో 25, పూతలపట్టులో 21, గంగవరం, సదుం మండలాల్లో 18 చొప్పున, నగరి, పులిచెర్ల, రేణిగుంట మండలాల్లో 17 చొప్పున, సోమల, ఏర్పేడు మండలాల్లో 16 వంతున, ఎర్రావారిపాళ్యంలో 15, చంద్రగిరి, నారాయణవనం మండలాల్లో 14 వంతున, శ్రీరంగరాజపురంలో 13, కలికిరి, పాకాల మండలాల్లో 10 వంతున, జీడీనెల్లూరు, కార్వేటినగరం, రామసముద్రం మండలాల్లో 9 వంతున, పుంగనూరు, తవణంపల్లె, వెదురుకుప్పం మండలాల్లో 8 వంతున, పలమనేరు, రొంపిచెర్ల మండలాల్లో 7 వంతున, శ్రీకాళహస్తి, గుడిపాల, కుప్పం, పెద్దపంజాణి, శాంతిపురం, విజయపురం మండలాల్లో 6 వంతున, కలకడ, నిండ్ర, రామకుప్పం, సత్యవేడు మండలాల్లో 5 చొప్పున, బైరెడ్డిపల్లె, పాలసముద్రం, పీటీఎం మండలాల్లో 4 వంతున, చిన్నగొట్టిగల్లు, గుడుపల్లె, గుర్రంకొండ, నాగలాపురం, పెద్దమండ్యం, పిచ్చాటూరు, రామచంద్రాపురం, వాల్మీకిపురం, వి.కోట, యాదమరి మండలాల్లో 3 చొప్పున, చౌడేపల్లె, ఐరాల, తంబళ్ళపల్లె, తొట్టంబేడు మండలాల్లో 2 వంతున, బి.కొత్తకోట, బంగారుపాళ్యం, కురబలకోట, నిమ్మనపల్లె, వడమాలపేట మండలాల్లో ఒక్కొక్కటి వంతున కొత్త కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2021-06-17T07:18:45+05:30 IST