భయం గుప్పిట్లో టీటీడీ ఉద్యోగులు
ABN , First Publish Date - 2020-09-18T16:45:55+05:30 IST
టీటీడీ ఉద్యోగుల్లో ఇప్పటివరకు 1,572 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో..
తిరుమల(ఆంధ్రజ్యోతి): టీటీడీ ఉద్యోగుల్లో ఇప్పటివరకు 1,572 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో ఓ అర్చకుడితో పాటు నలుగురు ఉద్యోగులు మృతి చెందారు.1,403మంది ఉద్యోగులు కోలుకోగా 169 మంది చికిత్స పొందుతున్నట్టు సమాచారం.కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా అత్యవసర విభాగాలక వసరమైన సిబ్బందికే విధులు కేటాయిస్తూ వచ్చారు. జూన్ 8వ తేదీ నుంచి శ్రీవారి దర్శనాలను తిరిగి ప్రారంభించిన క్రమంలో కరోనా కేసులు బాగా పెరిగిపోయాయి.దీంతో ఉద్యోగులు భయం గుప్పిట్లోనే విధులు నిర్వహిస్తూ వస్తున్నారు.