కరోనా ఆంక్షలు ఆహార కొరతకు దారి తీయచ్చు: ఐక్యరాజ్య సమితి

ABN , First Publish Date - 2020-03-27T00:02:20+05:30 IST

కరోనా కట్టడికి ప్రస్తుతం అనేక దేశాలు అవలంబిస్తున్న ఒకే ఒకే సూత్రం లాక్‌డౌన్. ముఖ్యంగా ఇతర దేశాలతో ప్రభుత్వాలు రక్షణాత్మక ధోరణి పాటిస్తున్నాయి. ఎగుమతులను నిలిపివేశాయి. అయితే ఈ చర్యలు భవిష్యత్తులో ఆహార కొరత సృష్టిస్తాయని ఐజ్యరాజ్య సమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చీఫ్ ఎకానమిస్ట్ మాక్సీమో టొరీరో వ్యాఖ్యానించారు.

కరోనా ఆంక్షలు ఆహార కొరతకు దారి తీయచ్చు: ఐక్యరాజ్య సమితి

వాషింగ్టన్: కరోనా కట్టడికి ప్రస్తుతం అనేక దేశాలు అవలంబిస్తున్న ఒకే ఒకే సూత్రం లాక్‌డౌన్. ముఖ్యంగా ఇతర దేశాలతో ప్రభుత్వాలు రక్షణాత్మక ధోరణి పాటిస్తున్నాయి. ఎగుమతి దిగుమతులను నిలిపివేశాయి. అయితే ఈ చర్యలు భవిష్యత్తులో ఆహార కొరత సృష్టిస్తాయని ఐజ్యరాజ్య సమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చీఫ్ ఎకానమిస్ట్ మాక్సీమో టొరీరో వ్యాఖ్యానించారు. ‘స్వేఛ్చ వాణిజ్యానికి వ్యతిరేకమైన చర్యలన్నీ ప్రతికూల ఫలితాన్నిస్తాయి. కరోనా ఆంక్షల కారణంగా వివిధ దేశాల మధ్య ఆహార సరఫరా నిలిచిపోవచ్చు. అయితే రక్షణాత్మక ధోరణులకు ఇది సమయం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఆహార సరఫరా సునాయసంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి’ అని ఆయన సూచించారు.

Updated Date - 2020-03-27T00:02:20+05:30 IST