యాంటీబాడీలు అంతరించాక తిరిగి కరోనా ముప్పు!

ABN , First Publish Date - 2020-10-21T15:35:16+05:30 IST

కరోనా బాధితుని శరీరంలో ఆ వైరస్‌ను ఎదుర్కొనేందుకు యాంటీ బాడీలు తయారవుతాయి. అయితే కొంతకాలం తరువాత ఆ యాంటీ బాడీలు క్షీణిస్తాయి. అప్పడు...

యాంటీబాడీలు అంతరించాక తిరిగి కరోనా ముప్పు!

న్యూఢిల్లీ: కరోనా బాధితుని శరీరంలో ఆ వైరస్‌ను ఎదుర్కొనేందుకు యాంటీ బాడీలు తయారవుతాయి. అయితే కొంతకాలం తరువాత ఆ యాంటీ బాడీలు క్షీణిస్తాయి. అప్పడు ఆ బాధితునికి తిరిగి కరోనా సోకే ముప్పు ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ్ మీడియాకు తెలిపారు. 


ఈ అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయిని, కొన్ని నివేదికలు బయటకు వచ్చాయని పేర్కొన్నారు. దీని ప్రకారం ఆయా వ్యక్తుల శరీరాలలో యాంటీబాడీలు వేర్వేరు అవధుల వరకూ ఉంటున్నట్లు తేలింది. కొన్ని అధ్యయనాలలో మూడు నెలల వరకూ శరీరంలో యాంటీ బాడీలు ఉంటాయని తేలగా, మరికొన్ని అధ్యయనాల్లో ఐదు నెలల పాటు యాంటీ బాడీలు ఉంటాయని వెల్లడయ్యింది. శరీరంలో యాంటీబాడీలు క్షీనించాక తిరిగి కరోనా వచ్చే అవకాశం ఉందన్నారు. యూరప్, చైనా, అమెరికా, రష్యాతో పాటు పలు దేశాలలో కరోనాతో పోరాడే యాంటీబాడీల విషయమై పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. 


Updated Date - 2020-10-21T15:35:16+05:30 IST