కార్పొరేటర్‌ బీజేపీ అభ్యర్థిపై వైసీపీ నేతల దాడి

ABN , First Publish Date - 2020-07-14T10:32:13+05:30 IST

జిల్లా కేంద్రంలో కార్పొరేటర్‌ బీజేపీ అభ్యర్థిపై వైసీపీ నాయకులు దాడి చేశారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

కార్పొరేటర్‌ బీజేపీ అభ్యర్థిపై వైసీపీ నేతల దాడి

నారాయణరావు పరిస్థితి విషమం


విజయనగరం క్రైమ్‌, జూలై 13: జిల్లా కేంద్రంలో కార్పొరేటర్‌ బీజేపీ అభ్యర్థిపై వైసీపీ నాయకులు దాడి చేశారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని 21వ వార్డు నాగవంశం వీధిలో సోమవారం రాత్రి వైసీపీ నాయకులు, బీజేపీ తరపున ఇదే వార్డులో నామినేషన్‌ వేసిన అభ్యర్థి కాళ్ల నారాయణరావుకు మధ్య గొడవ జరిగింది.


కొద్దిసేపటికి ఘర్షణకు దారితీసింది. నారాయణరావుపై వైసీపీ నాయకులు దాడి చేశారు. కళ్లల్లో కారం కొట్టి కత్తులతో దాడికి పాల్పడినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. తీవ్రం గా గాయపడిన నారాయణరావును జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విష మంగా ఉండడంతో  విశాఖ కేజీహెచ్‌కు వైద్యులు రిఫర్‌ చేశారు. ఘర్షణలో ఇరువర్గాలపైనా కేసు నమోదు చేసినట్లు సీఐ ఎర్రంనాయుడు తెలిపారు. వైసీపీకి చెందిన కనకల అప్పలనాయుడు, మొకర సురేష్‌లను కూడా ఆసుపత్రిలో చేర్చామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. 

Updated Date - 2020-07-14T10:32:13+05:30 IST