కొత్తపల్లిలో 55 మందికి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-01-21T06:07:29+05:30 IST

కొత్తపల్లి, జనవరి 20: కొత్తపల్లి పీహెచ్‌సీలో బుధవారం 55 మంది అంగన్‌వాడీ, ఆరోగ్య సిబ్బందికి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ నిర్వహించామని డాక్టర్‌ కుసుమ మౌనిక తెలిపారు. కొత్తపల్లి పీహెచ్‌సీ సిబ్బందితో పా టు నాగులాపల్లి పీహెచ్‌సీ పరిధిలో ఉన్న సుమారు 126 మంది సిబ్బంది

కొత్తపల్లిలో 55 మందికి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌
కొత్తపల్లి పీహెచ్‌సీలో అంగన్‌వాడీ కార్యకర్తకు కొవిడ్‌ టీకా ఇస్తున్న ఆరోగ్య సిబ్బంది

కొత్తపల్లి, జనవరి 20: కొత్తపల్లి పీహెచ్‌సీలో బుధవారం 55 మంది అంగన్‌వాడీ, ఆరోగ్య సిబ్బందికి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ నిర్వహించామని డాక్టర్‌ కుసుమ మౌనిక తెలిపారు. కొత్తపల్లి పీహెచ్‌సీ సిబ్బందితో పా టు నాగులాపల్లి పీహెచ్‌సీ పరిధిలో ఉన్న సుమారు 126 మంది సిబ్బందికి టీకా వేయాల్సి ఉండగా కేవలం 55 మందికి మాత్రమే టీకా వేశామన్నారు. మిగిలిన వారిలో 57 మంది హాజరు కాలేదన్నారు. 13 మంది మాత్రం వివిధ ఆరోగ్యసమస్యల కారణంగా టీకా వేసుకోలేదని మౌనిక చెప్పారు. నాగులాపల్లి పీ హెచ్‌సీ వైద్యుడు తడాల అరుణ్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-21T06:07:29+05:30 IST