ఛాతీ ఆస్పత్రిలో అదనంగా మరో కొవిడ్ వార్డు
ABN , First Publish Date - 2021-05-10T05:29:01+05:30 IST
ఎర్రగడ్డలోని ఛాతీ వ్యాధుల ఆస్పత్రిలో ప్రస్తుతం ఉన్న కొవిడ్ వార్డుకు అదనంగా 42 పడకలతో కొవిడ్ వార్డును ఏర్పాటు చేస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ ఖాన్ తెలిపారు.
42 పడకలతో నేటి నుంచే అందుబాటులోకి
ఎర్రగడ్డ, మే 9 (ఆంధ్రజ్యోతి): ఎర్రగడ్డలోని ఛాతీ వ్యాధుల ఆస్పత్రిలో ప్రస్తుతం ఉన్న కొవిడ్ వార్డుకు అదనంగా 42 పడకలతో కొవిడ్ వార్డును ఏర్పాటు చేస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ ఖాన్ తెలిపారు. ప్రస్తుతం కరోనా వార్డులో 177 పడకలు ఉండగా, అదనంగా 42 పడకలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటితో కలుపుకొని ఆస్పత్రిలో మొత్తం 219 పడకలు అందుబాటులో ఉంటాయన్నారు. ఇందులోనే 26 వెంటిలెటర్ బెడ్లు ఉన్నాయని ఆయన తెలిపారు. నూతనంగా ఏర్పాటు అవుతున్న ఈ వార్డు సోమవారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. మరొక పది పడకలను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.