మరో ముగ్గురు మృతి
ABN , First Publish Date - 2021-08-02T06:17:12+05:30 IST
జిల్లాలో కరోనా మహమ్మారికి మరో ముగ్గురు బాధితులు ఆదివారం బలైపోయారు.
కొత్తగా 299 మందికి కరోనా
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లాలో కరోనా మహమ్మారికి మరో ముగ్గురు బాధితులు ఆదివారం బలైపోయారు. గడచిన 24 గంటల్లో కొత్తగా 299 మందికి వైరస్ సోకింది. వీటితో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసులు 1,09,147కు పెరిగాయి. మొత్తం కరోనా మరణాలు అధికారికంగా 1,214కు చేరుకున్నాయి. జిల్లావ్యాప్తంగా వైరస్ బారినపడినవారిలో ఇప్పటివరకు 1,04,937 మంది కోలుకున్నారు. ఇంకా 2,996 మంది పాజిటివ్ బాధితులు కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.