అత్యల్పస్థాయికి కొవిడ్‌ కేసులు

ABN , First Publish Date - 2021-10-12T06:27:19+05:30 IST

చిత్తూరు జిల్లాలో ఆది, సోమవారాల నడుమ కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి అత్యల్పస్థాయికి చేరుకుంది.

అత్యల్పస్థాయికి కొవిడ్‌ కేసులు

తిరుపతి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆది, సోమవారాల నడుమ కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి అత్యల్ప స్థాయికి చేరుకుంది. ఈ వ్యవధిలో కొవిడ్‌తో ఒకరు మృతి చెందగా కొత్తగా 45 పాజిటివ్‌ కేసులు నమోద య్యాయి.వీటితో జిల్లాలో కేసుల సంఖ్య 245176కు చేరింది.మరణాల సంఖ్య 1926కు పెరిగింది.సోమవారం ఉదయానికి జిల్లాలో యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు 1140 వున్నాయి. కొత్తగా గుర్తించిన కేసులు తిరుపతి నగరంలో 13, చిత్తూరులో 6, తిరుపతి రూరల్‌, పుత్తూరు, పాకాల మండలాల్లో 4 చొప్పున, పూతలపట్టులో 3, నగరి, ఐరాల, పెనుమూరు మండలాల్లో 2 వంతున, పలమనేరు, ఎర్రావారిపాలెం, పీలేరు, జీడీనెల్లూరు, ఏర్పేడు మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.

Updated Date - 2021-10-12T06:27:19+05:30 IST