కొవిడ్ దూకుడు
ABN , First Publish Date - 2021-04-14T06:33:31+05:30 IST
జిల్లాలో కొవిడ్ దూకుడు కొనసాగుతోంది. మంగళవారం భారీగా కేసులు నమోదయ్యాయి.
ఒక్కరోజే 284 పాజిటివ్ కేసులు
ఒంగోలులో 70, త్రిపురాంతకంలో 45 నమోదు
ఒంగోలు (కార్పొరేషన్) ఏప్రిల్ 13 : జిల్లాలో కొవిడ్ దూకుడు కొనసాగుతోంది. మంగళవారం భారీగా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే 284 పాజిటివ్లు వెలుగు చూశాయి. ఒంగోలులో అత్యధికంగా 70మందికి వైరస్ సోకింది. పశ్చిమప్రాంతమైన త్రిపురాంతకంలో 45 కేసులు వచ్చాయి. మార్కాపురంలో 12, నాగులుప్పలపాడులో 12, చీరాలలో 9, కొరిశపాడులో 8, ఇంకొల్లులో 5,అద్దంకిలో 5 కేసులు నిర్ధారణ అయ్యాయి. వాటితోపాటు జిల్లాలోని అన్నిప్రాంతాల్లోనూ కొవిడ్ పాజిటివ్లు నమోదయ్యాయి. సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 1,550కిపైగా కేసులు వచ్చాయి.