కొవిడ్ టీకా తీసుకున్న ఎంపీ సురేష్రెడ్డి
ABN , First Publish Date - 2021-03-05T05:41:09+05:30 IST
రాజ్యసభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి గురువారం ఆర్మూర్లోకి కమ్యూనిటీ హెల్త్సెంటర్లో కొవిడ్ టీకా తీసుకున్నారు. సురేష్రెడ్డికి కొవిషీల్డ్ టీకా వేశారు.
ఆర్మూర్, మార్చి 4: రాజ్యసభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి గురువారం ఆర్మూర్లోకి కమ్యూనిటీ హెల్త్సెంటర్లో కొవిడ్ టీకా తీసుకున్నారు. సురేష్రెడ్డికి కొవిషీల్డ్ టీకా వేశారు. రెండో విడత కార్యక్రమంలో గురువారం వరకు 39మంది టీకా వేసుకున్నారు. మొదటి, రెండు విడతలలో 655మంది టీకా తీసుకున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. టీకా వేసు కోడానికి ఆసుపత్రికి వచ్చిన ఎంపీకి జిల్లా వైద్యాధికారి సు దర్శనం, ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగరాజు, డాక్టర్ అ మృత్రాంరెడ్డి, తదితరులు స్వాగతం పలికారు. టీఆర్ఎస్ నాయకులు కోటపాటి నర్సింహంనాయుడు, జక్కరాజేశ్వర్, లోక హన్మాండ్లు, తదితరులు టీకా తీసుకున్నారు.
టీకాపై అనుమానాలు వద్దు : ఎంపీ సురేష్రెడ్డి
కరోనా టీకాపై ప్రజలు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని రాజ్యసభసభ్యుడు కేఆర్ సురేష్రెడ్డి పిలుపునిచ్చా రు. గురువారం ఆర్మూర్లో కమ్యూనిటీ హెల్త్ సెం టర్లో టీకా తీసుకున్న తర్వాత ఆయన విలేకరులతో మా ట్లాడారు. టీకాలపై ఎలాంటి అనుమానాలు అవ సరం లేదని, ప్రజలలో ధైర్యం నింపేందుకే తా ను టీకా తీసుకుంటున్నానన్నారు. లాక్డౌన్ స మయంలో గ్రామాలలో ప్రజాప్ర తినిధులు, యువకులు, గ్రామాభివృద్ధి కమిటీలు నిబంధ నలు కట్టుదిట్టంగా అమలు చేయడం వల్ల న ష్టం జరగలేదన్నారు. అదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలన్నారు. అవసర మైతే టీకా సెంటర్లు పెంచడానికి ప్రభు త్వం సిద్ధంగా ఉందని, జిల్లా యంత్రాం గం కూడా విస్తృత ఏర్పాట్లు చేస్తోందన్నా రు. ఇదిలా ఉండగా.. రాజ్యసభ సభ్యుడి గా ఎన్నికైన సురేష్రెడ్డి మొదటి సారి ఆ ర్మూర్ ప్రాంతానికి వచ్చారు. సరిగ్గా ఏ డాది కిందట రాజ్యసభకు టీఆర్ఎస్ త రఫున ఎన్నికయ్యారు. సురేష్రెడ్డి వస్తు న్న విషయం తెలుసుకుని ఆర్మూర్, బా ల్కొండ నియోజకవర్గాలకు చెందిన అ నుచరులు ఆర్మూర్ వచ్చారు. డీసీఎం ఎస్ మాజీవైస్చైర్మన్ లోక ముత్యంరెడ్డి, బాల్కొండ మండల టీఆర్ఎస్ అధ్యక్షు డు ప్రవీణ్రెడ్డి, జక్క రాజేశ్వర్, అక్లూర్ నర్సారెడ్డి, రాంపూర్ గంగాధర్, లోక హ న్మాండ్లు, జగత్రెడ్డి, చంద్రవదన్ రావు, సుమో రాజేశ్వర్, తదితరులు సురేష్ రెడ్డిని కలిశారు.