మహిళలను వేదిస్తే కఠిన చర్యలు : సీపీ
ABN , First Publish Date - 2020-07-02T11:24:37+05:30 IST
మహిళలను, వి ద్యార్థినులను ఆకతాయిలు వేదిస్తే వా రిపై కఠిన చర్యలు తప్పవని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ హెచ్చరించారు
ఖిల్లా, జూలై 1: మహిళలను, విద్యార్థినులను ఆకతాయిలు వేదిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ హెచ్చరించారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ షీటీం బృందాలు ని ఘా ఉంచాలన్నారు. ఎవరైనా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా, వేధింపులకు గురిచేసినా షీటీం నెంబ రు 94906 18029కు గానీ, డయల్ 100కు గానీ ఫోన్చేసి సమాచారం అందించాలన్నారు. వెంటనే షీటీం బృందాలు సంఘటన స్థలానికి వస్తాయని ఆయన తెలిపారు.