ఎయిడెడ్‌ విద్యార్థులకు న్యాయం చేయాలి

ABN , First Publish Date - 2021-10-21T05:30:00+05:30 IST

జిల్లాలో ఎయిడెడ్‌ కళాశాలల్లో పనిచేసే అధ్యాపకుల్ని ప్రభుత్వ కళాశాలల్లో విలీనం చేసిన నేపథ్యంలో అక్కడ చదివే విద్యార్థులకు న్యాయం చేయాలని సీపీఎం నగర కార్యదర్శి నళినీకాంత తెలిపారు.

ఎయిడెడ్‌ విద్యార్థులకు న్యాయం చేయాలి
ఆర్‌జేడీకి వినతిపత్రం అందజేస్తున్న సీపీఎం నాయకులు

గుంటూరు(విద్య), అక్టోబరు 21: జిల్లాలో ఎయిడెడ్‌ కళాశాలల్లో పనిచేసే అధ్యాపకుల్ని ప్రభుత్వ కళాశాలల్లో విలీనం చేసిన నేపథ్యంలో అక్కడ చదివే విద్యార్థులకు న్యాయం చేయాలని సీపీఎం నగర కార్యదర్శి నళినీకాంత తెలిపారు. ఈ మేరకు గురువారం ఆర్‌జేడీ జ్యోత్స్యకుమారికి వినతి పత్రం అందజేశారు. ఎయిడెడ్‌ నిలిపివేయడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు వేలాది రూపాయలు ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆయా కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందన్నారు. కార్యక్రమంలో నాయకులు  ఎల్‌ అరుణ, షేక్‌ ఖాసింవలి, రమణ, ఎస్‌ కార్తీక్‌, షేక్‌ ఖాశింషహీద్‌,  కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-21T05:30:00+05:30 IST